మానేరు డ్యామ్ లో బోటెక్కబోయి కాలుజారిన గంగుల కమలాకర్.. తృటిలో తప్పిన ప్రమాదం!

  • మానేరు డ్యామ్ లో బోటింగ్ కు వెళ్లిన గంగుల
  • కాలుజారి నీటిలో పడ్డ టీఆర్ఎస్ నేత
  • బయటకు తీసిన సిబ్బంది
తెలంగాణ రాష్ట్ర సమితి నేత గంగుల కమలాకర్, ఈ ఉదయం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నేడు ఆయన మానేరు డ్యామ్ లో బోట్ ఎక్కబోతున్న క్రమంలో కాలుజారి నీటిలో పడిపోయారు. అలా రెండు సార్లు జరిగింది. ఆ పక్కనే ఉన్న సిబ్బంది ఆయన్ను బయటకు తీశారు.

వాస్తవానికి నాలుగు రోజుల క్రితం మానేరు డ్యామ్ లో గంగుల బోటింగ్ ను ప్రారంభించాల్సి వుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో, అధికారులే ఆ పని ముగించారు. రెండు స్పీడ్ బోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఉదయం ఎన్నికల ప్రచారంలో ఉన్న గంగుల, సరదాగా కాసేపు బోటింగ్ చేయాలని భావించారు. ఆ క్రమంలోనే కాలుజారి డ్యామ్ లో పడిపోయారు. అయితే, లైఫ్ జాకెట్ ను ఆయన ధరించి వుండటంతో ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. గంగుల సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
Maneru Dam
Gangula Kamalakar
Boating

More Telugu News