తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రుల ఫోన్ కాల్స్!

  • పెండింగ్ శంకుస్థాపనలు పూర్తి చేయాలి
  • అవి రేపు, ఎల్లుండిలోగా జరగాలి
  • ఎమ్మెల్యేలందరూ ఎల్లుండికి హైదరాబాదులో ఉండాలి
‘తెలంగాణ’లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు మంత్రులు ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాలలో పెండింగ్ లో ఉన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను రేపు, ఎల్లుండి లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేలందరూ ఎల్లుండి ఉదయం హైదరాబాదులో అందుబాటులో ఉండాలని మంత్రులు ఆదేశించినట్టు తెలుస్తోంది.  
Go Back to Shorts
Telangana
mla`s
ministers

More Telugu News