స్కూల్ ట్యాబ్లెట్స్ లో అశ్లీల చిత్రాలు.. ఛత్తీస్ గఢ్ లో వణికిపోతున్న మహిళా టీచర్లు!

టెక్నాలజీని సరిగ్గా వాడుకోకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో చెప్పేందుకు తాజా ఉదాహరణే ఈ ఘటన. ఛత్తీస్ గఢ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు కేంద్రం గతేడాది ట్యాబ్లెట్స్ ను అందించింది. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయి.

అయతే రాయ్ పూర్ జిల్లాలోని ఓ టీచర్ వీటి ద్వారా పోర్న్ సైట్లు చూడటంతో అసలు సమస్య మొదలైంది. సదరు సైట్లను ఓపెన్ చేయడంతో వాటిలోని వైరస్ అన్ని ట్యాబ్లెట్లకు సోకింది. దీంతో వీటిని ఆన్ చేయగానే తెరపై అశ్లీల చిత్రాల పాప్అప్స్ రావడం మొదలుపెట్టాయి. ఈ అశ్లీల చిత్రాల నేపథ్యంలో ట్యాబ్లెట్లను వినియోగించేందుకు మహిళా టీచర్లు నిరాకరిస్తున్నారు. కనీసం బయోమెట్రిక్ ఇచ్చేందుకు కూడా వారు ముందుకు రావడం లేదు.

దీంతో సమస్యను పరిష్కరించేవరకూ ఈ ట్యాబ్లెట్స్ ను వాడొద్దని రాయ్ పూర్ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. ‘శాలా కోశ్’ ప్రాజెక్ట్ కింద కేంద్ర మానవవనరుల శాఖ ఛత్తీస్ గఢ్ కు 51,000 ట్యాబ్లెట్స్ ను అందించింది. 
Go Back to Shorts
tablets
chattisgadh
porn sites
raipur
biometric
virus
women teachers

More Telugu News