'మాయల ఫకీరు' అవతారమెత్తిన టీడీపీ ఎంపీ!
- రోజుకో వేషంతో వస్తున్న శివప్రసాద్
- నేడు పార్లమెంట్ ముందుకు మాయల ఫకీరు వేషంలో
- హోదా ఇవ్వకుంటే మోదీని మాయం చేస్తానన్న ఎంపీ
ఇతర తెలుగుదేశం ఎంపీలతో కలసి పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం ముందు ఆయన నిరసనకు దిగారు. రాష్ట్రానికి హోదాను ఇవ్వని నరేంద్ర మోదీని మాయం చేసే రోజు దగ్గర్లోనే ఉందని ఈ సందర్భంగా శివప్రసాద్ వ్యాఖ్యానించారు. తన మంత్రదండం రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కనీయకుండా చేస్తుందని అన్నారు. టీడీపీ ఎంపీలు మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ తదితరులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.