కుప్పకూలిన హైదరాబాద్ సీబీఎస్ డోమ్!
- దశాబ్దాలపాటు సేవలందించిన సీబీఎస్
- గత కొన్నాళ్లుగా నిరుపయోగంలో
- ఈ ఉదయం కూలిన డోమ్
దీన్ని తొలగించాలన్న ప్రతిపాదనలు అధికారుల వద్ద ఉన్నాయి. దానిపై నిర్ణయం తీసుకునేలోపే డోమ్ కూలడం గమనార్హం. మూసీ నది మధ్యలో ఎంజీబీఎస్ (మహాత్మా గాంధీ బస్ స్టేషన్) నిర్మించిన తరువాత, హైదరాబాద్ బస్టాండును సీబీఎస్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆపై దసరా, సంక్రాంతి వంటి పర్వదినాల వేళ, అధిక రద్దీని తట్టుకునేందుకు సీబీఎస్ నుంచి రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే బస్సులను నడుపుతూ ఉండేవారు.