చంద్రబాబు నుంచి మోదీ వరకూ... జగమంత యోగా!

  • నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • దేశవ్యాప్తంగా 5 వేల చోట్ల వేడుకలు
  • డెహ్రాడూన్ లో పాల్గొన్న నరేంద్ర మోదీ
  • అమరావతిలో చంద్రబాబు యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో 55 వేల మంది ఔత్సాహికులతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. ఓ భారీ మైదానంలో వయోభేదం లేకుండా బారులు తీరిన ప్రజలు పలు రకాల ఆసనాలు వేసి, తమ ఫిట్ నెస్ ను చూపారు. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన యోగా డే వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 5 వేల ప్రాంతాల్లో 'శాంతి కోసం యోగా' పేరిట ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. ఢిల్లీలో ఎనిమిది చోట్ల యోగా డే జరుగుతుండగా, రెడ్ ఫోర్ట్ వద్ద బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరుగుతోంది. ఇక, అమరావతిలోని ప్రజా దర్బార్ హాల్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పలువురు మంత్రులు, అధికారులతో కలసి ఆయన యోగాసనాలు వేశారు.
Go Back to Shorts
Yoga Day
Chandrababu
Narendra Modi
Dehradoon
Amaravati

More Telugu News