టీడీపీ మహానాడుకు వేదిక ఖరారు!

  • ఈనెల 23 నుంచి మూడు రోజుల పాటు మహానాడు
  • విజయవాడ కానూరులోని సిద్ధార్థ కాలేజీ మైదానంలో వేడుక
  • కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించిన కళావెంకట్రావు
ఈనెల 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరగనుంది. విజయవాడలోని కానూరులో ఈ వేడుకను నిర్వహించనున్నారు. కానూరులోని సిద్ధార్థ కాలేజీ మైదానంలో నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి కళావెంకట్రావు ఈ ఉదయం కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించారు.

 మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో పలు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో... ఈ మహానాడు ద్వారా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. తద్వారా పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపనున్నారు.
Go Back to Shorts
Telugudesam
mahanadu
venue
vijayawada
kanuru
Chandrababu
kala venkatrao

More Telugu News