రాజస్థాన్ అసెంబ్లీలో విడ్డూరం...దెయ్యాలపై చర్చించిన నేతలు!
- అసెంబ్లీ ప్రాంగణంలో దెయ్యాలున్నాయని ఆందోళన
- గత ఆరు నెలల్లో ఇద్దరు శాసనసభ్యుల మృతి!
- శుద్ధి కార్యక్రమాలు జరిపించాలని స్పీకర్కు వినతి
- ఇదే అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని చీఫ్ విప్ సరదా వ్యాఖ్య
చర్చ సాగుతుండగా స్పీకర్ మేఘ్వాల్ జోక్యం చేసుకుని దెయ్యాల అంశంపై ప్రత్యేకంగా చర్చ జరగాలని చెప్పారు. కాగా, గురువారం బీజేపీ ఎంఎల్ఏ హబీబుర్ రెహ్మాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ...ఈ ప్రాంగణంలో లోపల కొంతభాగం ఒకప్పుడు శ్మశానవాటిక ఉండేదని, అందువల్ల అసెంబ్లీ భవనంలో దెయ్యాలు ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయన మాటలతో మిగతా ఎంఎల్ఏలు కూడా ఏకీభవించారు. రాజస్థాన్ అసెంబ్లీ భవనాన్ని జ్యోతి నగర్లోని దాదాపు 16.96 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కాంప్లెక్స్ని ఆనుకునే లాల్ కోఠి శ్మశాన వాటిక ఉంది. కాగా, గత ఆరు నెలల్లో ఇద్దరు శాసనసభ్యులు మరణించిన నేపథ్యంలో సభ్యులు ఇలా దెయ్యాల ఉనికిపై చర్చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.