అచ్చెన్నాయుడికి ఇదే నా వార్నింగ్: విష్ణుకుమార్ రాజు

  • విష్ణుకుమార్ రాజు పూటకో మాట మాట్లాడతారన్న అచ్చెన్నాయుడు
  • ఎప్పుడు మాట మార్చానో చెప్పాలని ప్రశ్నించిన విష్ణుకుమార్ రాజు
  • నిజా నిజాలను నిర్ధారించుకుని మాట్లాడాలని వార్నింగ్
తాను పూటకో మాట మాట్లాడుతున్నానని విమర్శలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడిపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండించిన విష్ణుకుమార్ రాజు, తాను ఎప్పుడు మాట మార్చానో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఒకే మాటపై నిలబడే వ్యక్తినని, వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగేముందు ఒకటికి రెండుసార్లు నిజానిజాలను నిర్ధారించుకోవాలని ఆయనకు వార్నింగ్ ఇస్తున్నానని అన్నారు.

 ఒకరి వ్యక్తిత్వంపై విమర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుందని, కానీ అచ్చెన్నాయుడు బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. నీతి, నిజాయతీలతో కూడిన రాజకీయాలను మాత్రమే తాను చేస్తానని, ఆ సంగతిని అచ్చెన్నాయుడికి గుర్తు చేస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
BJP
Vishnu Kumar Raju
Kinjarapu Acchamnaidu

More Telugu News