ప్రతి వార్డుకు, ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్ రూపొందించండి: చంద్రబాబు ఆదేశం
- తెలివితేటలకు టెక్నాలజీ తోడైతే అద్భుతాలు వస్తాయి
- నదులను అనుసంధానించి మహా సంగమం చేస్తాం
- రాయలసీమ రతనాలసీమ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది
ప్రతి వార్డుకు, ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా విజన్ డాక్యుమెంట్లను రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. మన తెలివితేటలకు టెక్నాలజీ తోడైతే అద్భుతాలను చేయగలమని చెప్పారు. ఒకవైపు డిజిటల్ లిటరసీని ప్రోత్సహిస్తూనే, మరోవైపు ఫైబర్ గ్రిడ్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్, పరిష్కార వేదిక 1100, ఈ-ప్రగతి తదితర కార్యక్రమాలన్నీ టెక్నాలజీ వినియోగానికి నిదర్శనాలని అన్నారు. అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్ గా అవతరిస్తోందని, చిత్తూరు జిల్లా హార్టికల్చర్, పారిశ్రామికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. జన్మభూమి కార్యక్రమాలకు బ్యాంకర్లు వచ్చి రుణమేళా, బ్యాంకు లింకేజీలు ఇవ్వడం ఇదే తొలిసారని అన్నారు.