దైవ దర్శనానికి వెళ్లి అష్టకష్టాలు పడుతున్న భక్త కోటి!
- తిరుమలలో భక్తులను వణికిస్తున్న చలి
- క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్న భక్తులు
- ఆరుబయటే 30 వేల మంది పడిగాపులు
- ఈ ఉదయం మొదలైన సర్వదర్శనం
కేవలం వీఐపీలకు పెద్దపీట వేసిన టీటీడీ అధికారులు సామాన్యులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వీఐపీలకు దర్శనాలను ముగించి, సామాన్య భక్తులను వైకుఠ ద్వారం ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. అంతకుముందు రాత్రి 11 గంటలకే ఏకాంత సేవను ముగించి, ఆపై అర్ధరాత్రి 12.0కు ఆలయాన్ని తిరిగి తెరిచారు. తిరుప్పావై ప్రవచనాలను ఏకాంతంగా నివేదించిన తరువాత, అభిషేకం సైతం ఏకాంతంగానే జరిగింది. ఆ తరువాత ప్రొటోకాల్ వీఐపీ దర్శనం మొదలైంది. రేపు అర్ధరాత్రి వరకూ స్వామివారు విరామం లేకుండా భక్తులకు దర్శనం ఇవ్వనుండగా, సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా.