తెలుగు మహాసభలు అంత గొప్పగా ఏం జరగలేదు: కోదండరామ్

  • గత సభలకు, ఈ సభలకు తేడా లేదు
  • దశ, దిశ లేకుండానే నిర్వహించారు
  • ఉద్యమకారులను ప్రభుత్వం దూరం పెట్టింది
తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పెదవి విరిచారు. సభలు అంత గొప్పగా జరగలేదని అన్నారు. గతంలో జరిగిన సభలకు, ఈ సభలకు తేడా లేదని చెప్పారు. సమాఖ్యవాదాన్ని నిలబెట్టే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని ప్రభుత్వం దూరం పెట్టిందని... ఇది చాలా దారుణమని అన్నారు. ఎలాంటి దశ, దిశ లేకుండానే మహాసభలు జరిగాయని చెప్పారు.
Go Back to Shorts
Kodandaram
tjac
prapancha telugu maha sabhalu

More Telugu News