చైనా మొబైల్స్, యాప్స్ నుంచి భారత భద్రతకు తీవ్రముప్పు?
- 40 యాప్స్ ప్రమాదకరమన్న నిఘా అధికారి
- వీటిలో రోజువారీ వినియోగంలో ఉన్న యాప్స్
- భారత్ లో విపరీతంగా అమ్ముడయ్యే చైనా మొబైల్స్
సుమారు 40 యాప్స్ తో ఈ ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆ 40 యాప్స్ వాడినవారి వ్యక్తిగత వివరాలు చైనా అధికారులకు చేరే అవకాశం ఉందని ఆ హెచ్చరికల్లో ఉన్నట్టు సమాచారం. ఈ యాప్స్ లో ప్రతిఒక్కరూ సాధారణంగా వినియోగించే యాప్స్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ యాప్స్ ను సైనికాధికారులు, పారామిలటరీ దళాల సిబ్బంది వినియోగించడం వల్ల అత్యంత కీలక సమాచారం చైనాకు తెలిసిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలా జరిగితే దేశభద్రతకు విపత్తు సంభవించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.