జగన్‌ సతీమణి భారతీరెడ్డికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

వైసీపీ అధినేత జగన్ భార్య భారతీరెడ్డికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ అయింది. వివరాల్లోకి వెళ్తే, కాల్ మనీ కేసులో తనపై అసత్యపు వార్తలను ప్రచురించారంటూ కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సాక్షి దినపత్రికపై నూజివీడు కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి సాక్షి ఎండీ భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిలకు సమన్లు జారీ చేసినా... వారు కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో, వీరిద్దరిపైనా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది.
Go Back to Shorts
ys bharathi
ys jagan
ysrcp
non bailable warrant to ys bharathi
sakshi paper
sakshi tv

More Telugu News