తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. జాతీయ జెండాను ఆవిష్కరించిన శాసనసభ సభాపతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో లేజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి నరసింహ చార్యులు, శాసనసభ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణకు ముందు శాసనసభ ప్రాంగణంలోని డా. బిఆర్ అంబేడ్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు సభాపతి పోచారం, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలు వేసి నివాళులర్పించారు.  

More Press News