ఆ సినిమా టైటిల్ కు అర్థం ఏమిటో పవన్ కల్యాణ్ ను అడగండి: కవిత
- ‘ఇడుపు కాయితం’ టైటిల్పై రాజుకున్న వివాదం
- అర్థం తెలియాలంటే పవన్ను అడగాలన్న కవిత
- తెలంగాణ యాసను రేవంత్ రెడ్డి కాపాడటం లేదని విమర్శ
- ఉప్పల్లో జూలై 2న భూపోరాటానికి పిలుపు
- తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని ఆవేదన
టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్పై జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ, ఆ పదానికి అసలైన అర్థం తెలియాలంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అడగాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉప్పల్లో తన పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా కొందరు ఆంధ్ర నెటిజన్లు తెలంగాణ యాసను, ఈ పదాన్ని కించపరిచేలా ట్రోల్ చేస్తుండటం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కవిత స్పందిస్తూ, తెలంగాణ భాష, అస్తిత్వంపై దాడి జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ, చివరికి సొంత పార్టీ బీఆర్ఎస్ కూడా మౌనంగా ఉండటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
"రాష్ట్రంలో మరోసారి ఉద్యమకాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పుడు మనల్ని, మన భాషను ఎలా అయితే అవాకులు చెవాకులు పేలారో, ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనమందరం ఈ విషయాన్ని గమనించుకోవాలి.
నిన్నగాక మొన్న 'ఇడుపు కాయితం' అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. ఈ పేరు అర్థం కావడం లేదంటూ కొందరు దానిపై ట్రోలింగ్ చేస్తున్నారు. తెలంగాణ యాసను అవమానించడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా... 'ఇడుపు కాయితం' అంటే అర్థం తెలియకపోతే, వెళ్లి సినిమా నటుడు పవన్ కళ్యాణ్ను అడగండి. ఆయనకు ఆ పదం అర్థం బాగా తెలుసు, కచ్చితంగా వివరిస్తారు.
మా భాషను, యాసను అవహేళన చేసినందుకే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇంకోసారి ఇటువంటి వెకిలి ప్రయత్నాలు చేయకండి. ఒకరి భాషను ఒకరం, ఒకరి సంస్కృతిని ఒకరం గౌరవించుకుందాం. అందరం కలిసే ఉందాం. కానీ, తెలంగాణను అవమానిస్తాం, మా భాషను కించపరుస్తాం అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.
ఈరోజు తెలంగాణ భాషను ఇంతగా కించపరుస్తున్నా కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు. ఎందుకంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదు. ఇక బీజేపీ సంగతి సరేసరి. దేశంలోని సమస్యలు తప్ప, తెలంగాణ గురించి వారికి పట్టదు. బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడదు. ఎందుకంటే, అందులో ఓ గుంటనక్క ఉంది. ఆయన వ్యాపారాలన్నీ ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారితోనే ముడిపడి ఉన్నాయి" అని ఆరోపించారు.
ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్పై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా కొందరు ఆంధ్ర నెటిజన్లు తెలంగాణ యాసను, ఈ పదాన్ని కించపరిచేలా ట్రోల్ చేస్తుండటం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కవిత స్పందిస్తూ, తెలంగాణ భాష, అస్తిత్వంపై దాడి జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ, చివరికి సొంత పార్టీ బీఆర్ఎస్ కూడా మౌనంగా ఉండటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
"రాష్ట్రంలో మరోసారి ఉద్యమకాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పుడు మనల్ని, మన భాషను ఎలా అయితే అవాకులు చెవాకులు పేలారో, ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనమందరం ఈ విషయాన్ని గమనించుకోవాలి.
నిన్నగాక మొన్న 'ఇడుపు కాయితం' అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. ఈ పేరు అర్థం కావడం లేదంటూ కొందరు దానిపై ట్రోలింగ్ చేస్తున్నారు. తెలంగాణ యాసను అవమానించడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా... 'ఇడుపు కాయితం' అంటే అర్థం తెలియకపోతే, వెళ్లి సినిమా నటుడు పవన్ కళ్యాణ్ను అడగండి. ఆయనకు ఆ పదం అర్థం బాగా తెలుసు, కచ్చితంగా వివరిస్తారు.
మా భాషను, యాసను అవహేళన చేసినందుకే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇంకోసారి ఇటువంటి వెకిలి ప్రయత్నాలు చేయకండి. ఒకరి భాషను ఒకరం, ఒకరి సంస్కృతిని ఒకరం గౌరవించుకుందాం. అందరం కలిసే ఉందాం. కానీ, తెలంగాణను అవమానిస్తాం, మా భాషను కించపరుస్తాం అంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.
ఈరోజు తెలంగాణ భాషను ఇంతగా కించపరుస్తున్నా కాంగ్రెస్ పార్టీ నోరు మెదపదు. ఎందుకంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదు. ఇక బీజేపీ సంగతి సరేసరి. దేశంలోని సమస్యలు తప్ప, తెలంగాణ గురించి వారికి పట్టదు. బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడదు. ఎందుకంటే, అందులో ఓ గుంటనక్క ఉంది. ఆయన వ్యాపారాలన్నీ ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారితోనే ముడిపడి ఉన్నాయి" అని ఆరోపించారు.