ఢిల్లీలో పాక్ హైకమిషన్ బయట బుల్డోజర్.. అసలేం జరిగింది?
- ఢిల్లీలో పాక్ హైకమిషన్ బయట కూల్చివేతలు
- అనుమతించిన హద్దులు దాటిన నిర్మాణాలపై చర్యలు
- బారికేడ్లు, క్యూ నిర్వహణ నిర్మాణాల తొలగింపు
- పాక్ హైకమిషన్ ప్రధాన గేటుకు జరగని నష్టం
- ఇస్లామాబాద్లోనూ ఇటీవల భారత హైకమిషన్ బయట బారికేడ్ల తొలగింపు
దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల అధికారులు గురువారం కూల్చివేతలు చేపట్టారు. హైకమిషన్కు అనుమతించిన హద్దులు దాటి కొన్ని నిర్మాణాలు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల ఉన్న రోడ్డుపై ఏర్పాటు చేసిన కొన్ని నిర్మాణాలను అధికారులు బుల్డోజర్తో తొలగించారు. హైకమిషన్ వీసా విభాగం వద్ద క్యూలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాలు కూడా ఇందులో ఉన్నాయి.
కూల్చివేతల తర్వాత అక్కడ శిథిలాలు కనిపించాయి. విరిగిన ఇనుప కంచెలు, గేట్లు, రేకులు, ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు, ప్లాస్టర్ శిథిలాలు రోడ్డుపై పడ్డాయి. వీసా దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు మాత్రం కనిపించాయి. అక్కడ ‘విండో-1’, ‘పాకిస్థానీ పాస్పోర్ట్ ఓన్లీ’, ‘విండో-5 / కలెక్షన్ ఆఫ్ వీసా అప్లికేషన్స్’ అనే సూచికలు ఉన్నాయి.
హైకమిషన్ ప్రధాన ప్రవేశ ద్వారం, దాని చుట్టూ ఉన్న గోడలు, గుమ్మట ఆకార నిర్మాణాలు, పాకిస్థాన్ చిహ్నంతో ఉన్న పెద్ద ఇనుప గేట్లు యథాతథంగా ఉన్నాయి. ప్రాంగణం చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాల్లో ముళ్ల కంచె కూడా కనిపించింది.
ఇస్లామాబాద్లోనూ ఇటీవల చర్యలు
ఢిల్లీలో ఈ చర్యలకు కొన్ని రోజుల ముందే ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల పాకిస్థాన్ అధికారులు భద్రతా బారికేడ్లు, పార్కింగ్ స్తంభాలను తొలగించారు. ఈ రెండు ఘటనలు ఒకే సమయంలో చోటుచేసుకోవడంతో ఇరు దేశాల దౌత్య వర్గాల్లో చర్చకు దారితీశాయి.
అయితే ఢిల్లీలో పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల కూల్చివేతలకు, అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూకశ్మీర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. శ్రీనగర్ పర్యటనలో జమ్మూకశ్మీర్ ‘భారత్లో ముఖ్యమైన భాగం’ అని గోర్ వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా రాయబార కార్యాలయ అధికారిని పిలిపించి పాకిస్థాన్ వివరణ కోరింది.
పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల ఉన్న రోడ్డుపై ఏర్పాటు చేసిన కొన్ని నిర్మాణాలను అధికారులు బుల్డోజర్తో తొలగించారు. హైకమిషన్ వీసా విభాగం వద్ద క్యూలను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాలు కూడా ఇందులో ఉన్నాయి.
కూల్చివేతల తర్వాత అక్కడ శిథిలాలు కనిపించాయి. విరిగిన ఇనుప కంచెలు, గేట్లు, రేకులు, ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు, ప్లాస్టర్ శిథిలాలు రోడ్డుపై పడ్డాయి. వీసా దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లు మాత్రం కనిపించాయి. అక్కడ ‘విండో-1’, ‘పాకిస్థానీ పాస్పోర్ట్ ఓన్లీ’, ‘విండో-5 / కలెక్షన్ ఆఫ్ వీసా అప్లికేషన్స్’ అనే సూచికలు ఉన్నాయి.
హైకమిషన్ ప్రధాన ప్రవేశ ద్వారం, దాని చుట్టూ ఉన్న గోడలు, గుమ్మట ఆకార నిర్మాణాలు, పాకిస్థాన్ చిహ్నంతో ఉన్న పెద్ద ఇనుప గేట్లు యథాతథంగా ఉన్నాయి. ప్రాంగణం చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాల్లో ముళ్ల కంచె కూడా కనిపించింది.
ఇస్లామాబాద్లోనూ ఇటీవల చర్యలు
ఢిల్లీలో ఈ చర్యలకు కొన్ని రోజుల ముందే ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల పాకిస్థాన్ అధికారులు భద్రతా బారికేడ్లు, పార్కింగ్ స్తంభాలను తొలగించారు. ఈ రెండు ఘటనలు ఒకే సమయంలో చోటుచేసుకోవడంతో ఇరు దేశాల దౌత్య వర్గాల్లో చర్చకు దారితీశాయి.
అయితే ఢిల్లీలో పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల కూల్చివేతలకు, అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూకశ్మీర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. శ్రీనగర్ పర్యటనలో జమ్మూకశ్మీర్ ‘భారత్లో ముఖ్యమైన భాగం’ అని గోర్ వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా రాయబార కార్యాలయ అధికారిని పిలిపించి పాకిస్థాన్ వివరణ కోరింది.