టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం!

Virat Kohli Ruled Out of Afghanistan ODI Series Due to Injury Report
  • తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం
  • ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది
  • ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తాడని ఊహించిన ఫ్యాన్స్‌కు నిరాశ
  • వన్డే ప్రపంచకప్‌లో ఆడడంపై గాయం ప్రభావం ఉండే ఛాన్స్
ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆయన తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. భారత జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. జూన్ 13 నుంచి 20 వరకు మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీకి ఈ గాయమైనట్లు సమాచారం. ఆ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఆర్‌సీబీ విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఆ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసే సమయంలో కోహ్లీ పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతూ కనిపించాడు. అయినప్పటికీ మ్యాచ్‌ను అద్భుతంగా ముగించగలిగాడు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. 16 మ్యాచ్‌ల్లో 56.25 సగటుతో, 165.85 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 675 పరుగులు చేశాడు.

ఐపీఎల్ ఫామ్‌ను ఆఫ్ఘన్‌ సిరీస్‌లోనూ కోహ్లీ కొనసాగిస్తాడని అంతా భావించారు. తద్వారా 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కోహ్లీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే ఆయన గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ గాయం తీవ్రత, సిరీస్‌కు అందుబాటులో ఉంటారా లేదా అనే దానిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Go Back to Shorts
Virat Kohli injury
India vs Afghanistan ODIs
Virat Kohli hamstring injury
RCB IPL 2026 final
Virat Kohli cricket news

More Telugu News