Amit Shah: చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోకుండా యూసీసీ అడ్డుకుంటుంది: అమిత్ షా
చొరబాటుదారులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ద్వారా అడ్డుకునే వీలుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అసోంలోని గోల్పడా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ, అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ రోడ్ మ్యాప్ సిద్ధం చేశారని అన్నారు. మోదీ నాయకత్వంలో ఆదివాసీ మహిళ దేశ ప్రథమ పౌరురాలు అయ్యారని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో యూసీసీని బలవంతంగా రుద్దుతున్నారని కాంగ్రెస్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చొరబాటుదారులు అక్కడి ఆదివాసీ మహిళలను వివాహం చేసుకోవడం ద్వారా రాజకీయ పలుకుబడిని సంపాదించడానికి ప్రయత్నించారని, ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోందని అన్నారు.
తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అసోంలో తమకు మరో ఐదేళ్లు సమయం ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి పూర్తిగా చొరబాటుల నుంచి విముక్తి కలిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అసోంలో యూసీసీని అమలు చేస్తామని అమిత్ షా అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో యూసీసీని బలవంతంగా రుద్దుతున్నారని కాంగ్రెస్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చొరబాటుదారులు అక్కడి ఆదివాసీ మహిళలను వివాహం చేసుకోవడం ద్వారా రాజకీయ పలుకుబడిని సంపాదించడానికి ప్రయత్నించారని, ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోందని అన్నారు.
తాము అధికారంలోకి వస్తే అక్రమ చొరబాట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అసోంలో తమకు మరో ఐదేళ్లు సమయం ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి పూర్తిగా చొరబాటుల నుంచి విముక్తి కలిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అసోంలో యూసీసీని అమలు చేస్తామని అమిత్ షా అన్నారు.