Telangana Congress: ఏడింట 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం.. 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా
- రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండలను దక్కించుకున్న కాంగ్రెస్
- కరీంనగర్లో బీజేపీ, కొత్తగూడెంలో సీపీఐ విజయం
- జనగాం, తొర్రూర్, క్యాతనపల్లి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా
తెలంగాణలో ఐదు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీజేపీ, సీపీఐ పార్టీలు చెరో కార్పొరేషన్ను దక్కించుకున్నాయి. రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్, కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ, కొత్తగూడెం కార్పొరేషన్ను సీపీఐ దక్కించుకున్నాయి.
రామగుండం, మంచిర్యాల, మహబూబ్ నగర్, నల్గొండలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది. నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీకి అవకాశాలు ఉన్నప్పటికీ, మజ్లిస్ పార్టీ మద్దతుతో దీనిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్గా 49వ వార్డు కార్పొరేటర్ ఉమారాణి, డిప్యూటీ మేయర్గా మజ్లిస్ పార్టీ 54వ వార్డు కార్పొరేటర్ సల్మా తహసీన్ ఎన్నికయ్యారు.
11 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదా
కోరం లేకపోవడం వల్ల 11 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. జనగాం, తొర్రూరు, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు.
రామగుండం, మంచిర్యాల, మహబూబ్ నగర్, నల్గొండలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది. నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీకి అవకాశాలు ఉన్నప్పటికీ, మజ్లిస్ పార్టీ మద్దతుతో దీనిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్గా 49వ వార్డు కార్పొరేటర్ ఉమారాణి, డిప్యూటీ మేయర్గా మజ్లిస్ పార్టీ 54వ వార్డు కార్పొరేటర్ సల్మా తహసీన్ ఎన్నికయ్యారు.
11 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదా
కోరం లేకపోవడం వల్ల 11 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. జనగాం, తొర్రూరు, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు.