Islamabad: ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ... 36కి చేరిన ఆత్మాహుతి దాడి మృతుల సంఖ్య

Islamabad Declares Emergency After Suicide Attack Kills 69
షార్ట్స్‌లో చూడండి
ఆత్మాహుతి దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించింది. ఇస్లామాబాద్‌లోని షియా మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో మృతుల సంఖ్య 36కి చేరగా, అనేక మంది గాయపడ్డారు. నగరంలోని షెహ్జాద్ టౌన్ ప్రాంతంలో గల షియా మసీదు ప్రధాన ద్వారం వద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల సమీపంలోని భవనాలు, కిటికీలు కూడా పగిలిపోయాయి.

పేలుడు అనంతరం నగరంలో నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించినట్లు ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్, పాలీక్లినిక్ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని, పలువురు మృతి చెందారని అన్నారు. ఆత్మాహుతి దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
Islamabad
Islamabad blast
Pakistan
Suicide attack
Shia mosque
Shehbaz Sharif
Emergency

More Telugu News