డేటా సెంటర్లకు అతిపెద్ద ముప్పు ఆన్-డివైజ్ ఏఐ: పర్‌ఫ్లెక్సిటీ సీఈవో

Arvind Srinivas Says On Device AI Biggest Threat to Data Centers
  • భవిష్యత్తులో డివైజ్‌లు ఇన్‌బిల్ట్ ఏఐతో వస్తాయన్న అరవింద్ శ్రీనివాస్
  • ఆన్-డివైజ్ ఏఐ మోడల్స్‌తో డేటా సెంటర్లకు అతిపెద్ద ముప్పు ఉందన్న పర్‌ఫ్లెక్సిటీ సీఈవో
  • డివైజ్‌లలోనే ఏఐతో కూడిన చిప్‌లు అమర్చితే డేటా సెంటర్ల అవసరం ఉండదని వ్యాఖ్య
గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ, పర్‌ఫ్లెక్సిటీ వంటి అగ్రగామి టెక్ సంస్థలు డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ దశాబ్దం చివరి నాటికి మొత్తం పెట్టుబడులు దాదాపు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో పర్‌ఫ్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాబోయే రోజుల్లో ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి పరికరాలు అంతర్గత కృత్రిమ మేధస్సు (ఏఐ)తోనే వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్-డివైజ్ ఏఐ మోడల్స్‌ వల్ల డేటా సెంటర్లకు అతిపెద్ద ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.

పరికరాల్లోనే ఏఐ ఆధారిత చిప్‌లను అమర్చడం ద్వారా కేంద్రీకృత డేటా సెంటర్ల నుంచి ఏఐ సేవలను వినియోగించాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆన్-డివైజ్ ఏఐ మోడల్స్‌ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని, ఏఐ మోడల్ వారి పరికరంలోనే ఉండటం వల్ల వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.
Go Back to Shorts
Arvind Srinivas
Perplexity AI
Data Centers
On-Device AI
Artificial Intelligence
Google
Meta

More Telugu News