కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
- అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం
- లండన్ వెళుతున్న విమానం కుప్పకూలిన వైనం
- విమానంలో 242 మంది ప్రయాణికులు... వారిలో 53 మంది బ్రిటన్ జాతీయులుసలిపోవడంపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పందన
- ఘటన దృశ్యాలు తీవ్ర ఆవేదన కలిగించాయన్న స్టార్మర్
- పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడి
ఈ ఘటనపై కీర్ స్టార్మర్ 'ఎక్స్' ద్వారా స్పందించారు. "భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో, లండన్ బయల్దేరిన విమానం కూలిపోయిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఆ విమానంలో అనేక మంది బ్రిటిష్ జాతీయులు కూడా ఉన్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు వివరిస్తున్నారు. ఈ తీవ్ర మనోవేదన కలిగించే సమయంలో ప్రయాణికులు మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రార్థనలు అండగా ఉంటాయి" అని తన పోస్ట్లో పేర్కొన్నారు.
కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు వంటి అంశాలపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.