Gajapati district: లైంగిక వేధింపులతో విసిగిపోయి.. వృద్ధుడిని చంపి.. కాల్చేసిన మహిళలు!
- ఒడిశాలో లైంగిక వేధింపులు భరించలేక మహిళల ఘాతుకం
- గజపతి జిల్లాలో ఈ నెల 3న ఘటన, ఆలస్యంగా వెలుగులోకి
- ఎనిమిది మంది మహిళలు సహా పది మంది అరెస్టు
- గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న పోలీసులు
తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆగ్రహంతో మహిళలంతా ఏకమై ఒక వృద్ధుడిని హతమార్చారు. అనంతరం ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లి కాల్చివేశారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం పది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం మరణించిన వ్యక్తి వయసు 60 సంవత్సరాలు. అతడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. అప్పటి నుంచి గ్రామంలోని పలువురు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ రాత్రి 52 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
నిందితుడి ఆగడాలు రోజురోజుకూ మితిమీరడంతో భరించలేని ఆరుగురు బాధితురాళ్లు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. 3వ తేదీ రాత్రి వారంతా సమావేశమై అతడిని అంతమొందించాలని నిశ్చయించుకున్నారు. పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న ఆ వ్యక్తిపై దాడి చేసి చంపేశారు. ఈ దారుణానికి మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా సహకరించినట్టు తేలింది. హత్య చేసిన తర్వాత, మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి, అక్కడ దహనం చేశారు.
కొన్ని రోజులుగా ఆ వ్యక్తి కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా హత్య విషయం బయటపడింది. ఈ హత్యలో పాలుపంచుకున్న ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు తమను నిరంతరం లైంగికంగా వేధించడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరుగురు మహిళలు పోలీసుల విచారణలో అంగీకరించారు.
అయితే, మృతుడి లైంగిక వేధింపుల గురించి గతంలో బాధితురాళ్ల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం మరణించిన వ్యక్తి వయసు 60 సంవత్సరాలు. అతడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. అప్పటి నుంచి గ్రామంలోని పలువురు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ రాత్రి 52 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.
నిందితుడి ఆగడాలు రోజురోజుకూ మితిమీరడంతో భరించలేని ఆరుగురు బాధితురాళ్లు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. 3వ తేదీ రాత్రి వారంతా సమావేశమై అతడిని అంతమొందించాలని నిశ్చయించుకున్నారు. పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న ఆ వ్యక్తిపై దాడి చేసి చంపేశారు. ఈ దారుణానికి మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా సహకరించినట్టు తేలింది. హత్య చేసిన తర్వాత, మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి, అక్కడ దహనం చేశారు.
కొన్ని రోజులుగా ఆ వ్యక్తి కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా హత్య విషయం బయటపడింది. ఈ హత్యలో పాలుపంచుకున్న ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు తమను నిరంతరం లైంగికంగా వేధించడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరుగురు మహిళలు పోలీసుల విచారణలో అంగీకరించారు.
అయితే, మృతుడి లైంగిక వేధింపుల గురించి గతంలో బాధితురాళ్ల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.