మొక్కలు పెంచకుంటే జరిగేది ఇదే!: మంత్రి పొన్నం
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్
- హైదరాబాద్ గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమం
- మొక్కల పెంపకాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
- భవిష్యత్ తరాలు ఆక్సిజన్ మాస్కులు ధరించాల్సి వస్తుందని ఆవేదన
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైతే మానవాళి అనేక రకాల నూతన వ్యాధుల బారిన పడుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, మొక్కలు నాటడాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారానే పర్యావరణ సమతుల్యతను కాపాడుకోగలమని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని భవిష్యత్ తరాలకు అందించగలమని ఆయన తెలిపారు. పర్యావరణ హిత చర్యలకు ప్రతి పౌరుడు తమ వంతు సహకారం అందించాలని కోరారు.