Arshi: గడ్డం తెచ్చిన తంట .. మరిదితో ఉడాయించిన మహిళ
- గడ్డం (షేవింగ్) చేసుకోవాలని భర్తను కోరిన భార్య అర్షి
- గడ్డం తీసేందుకు ససేమిరా అంటూ మొండికేసిన భర్త షకీర్
- తమ్ముడితో అర్ధాంగి లేచిపోవడంతో పోలీసులను ఆశ్రయించిన షకీర్
ఉత్తరప్రదేశ్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి చిన్న కారణంతో భర్తను వదిలి మరిదితో ఉడాయించింది. మేరఠ్లోని లిసాడి గేట్ ప్రాంతానికి చెందిన మౌలానా షకీర్కు అర్షితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. 12వ తరగతి వరకు చదువుకున్న ఈ యువతి ప్రస్తుతం కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది.
వివాహం జరిగిన తొలి రాత్రే అర్షి తన భర్త గడ్డంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గడ్డం తీయమని కోరింది. అయితే మౌలానా షకీర్ గడ్డం తీసేది లేదని తేల్చి చెప్పాడు. ఈ విషయంపై వారి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. మరోవైపు క్లీన్ షేవ్తో కళ్లెదుటే తిరుగుతున్న మరిదిపై అర్షి మనసు పారేసుకుంది. భర్త షకీర్ ప్రతిరోజూ ఉదయం పనికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అత్త, మరిది మాత్రమే ఉండేవారు.
ఈ క్రమంలో ఆమె మరిదికి దగ్గరైంది. ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం గురించి షకీర్, అర్షి తల్లిదండ్రులకు చెప్పగా, తమ కూతురితో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని వారు తెగేసి చెప్పారు. భార్య తీసుకున్న ఈ నిర్ణయంతో షాక్కు గురైన షకీర్ పోలీసులను ఆశ్రయించాడు. షకీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహం జరిగిన తొలి రాత్రే అర్షి తన భర్త గడ్డంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గడ్డం తీయమని కోరింది. అయితే మౌలానా షకీర్ గడ్డం తీసేది లేదని తేల్చి చెప్పాడు. ఈ విషయంపై వారి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. మరోవైపు క్లీన్ షేవ్తో కళ్లెదుటే తిరుగుతున్న మరిదిపై అర్షి మనసు పారేసుకుంది. భర్త షకీర్ ప్రతిరోజూ ఉదయం పనికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అత్త, మరిది మాత్రమే ఉండేవారు.
ఈ క్రమంలో ఆమె మరిదికి దగ్గరైంది. ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోయారు. ఈ విషయం గురించి షకీర్, అర్షి తల్లిదండ్రులకు చెప్పగా, తమ కూతురితో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని వారు తెగేసి చెప్పారు. భార్య తీసుకున్న ఈ నిర్ణయంతో షాక్కు గురైన షకీర్ పోలీసులను ఆశ్రయించాడు. షకీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.