Pradeep: విజయశాంతి గారికి ఫుల్ ఫీవర్.. అయినా బురదగుంట సీన్ చేశారన్న డైరెక్టర్!

Director Pradeep Interview
షార్ట్స్‌లో చూడండి
క్రితం వారం విడుదలైన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో విజయశాంతి... కల్యాణ్ రామ్ తల్లీకొడుకులుగా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రదీప్ చిలుకూరి మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా గురించిన అనేక విషయాలను పంచుకున్నారు.

"ఈ కథను రాసుకుంటున్నప్పుడే వైజయంతి పాత్రకి విజయశాంతి గారిని అనుకుని రాసుకోవడం జరిగింది. ఒకవేళ ఆమె చేయనంటే ఈ కథను పక్కన పెట్టేయాలని అనుకున్నాం. అదే విషయాన్ని విజయశాంతి గారితో చెప్పాము. తనని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయొద్దని ఆమె అనేవారు. సెట్లో విజయశాంతి - కల్యాణ్ రామ్ లను చూస్తే, తల్లీ కొడుకుల మాదిరిగానే అనిపించేవారు. ఆ పాత్రలను గురించి వారు చర్చించుకోవడమే అందుకు కారణమనుకోవచ్చు" అని అన్నారు.

"విజయశాంతిగారు డూప్ వద్దన్నారు.. ఫైట్స్ ఆమెనే చేశారు. ఫారెస్టులో కాల్పుల సమయంలో బురదగుంటలో ఆమె పడిపోయే సీన్ ఉంది. ఆమెనే దొర్లుతూ వెళ్లి బురదగుంటలో పడ్డారు. ఆ బురదగుంటలో తడుస్తూ షాట్ పూర్తయ్యేవరకూ అలాగే ఉన్నారు. ఆ షాట్ ను పూర్తి చేయడానికి రెండు గంటలపైన పట్టింది. ఆమెకి మూడు రోజుల నుంచి ఫీవర్ అనే విషయం అప్పుడు చెప్పారు. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ అయ్యేరనే విషయం అప్పుడు అర్థమైంది నాకు" అని వివరించారు.

Go Back to Shorts
Pradeep
Vijayashanthi
Kalyan Ram

More Telugu News