Shalini Pandey: 'అర్జున్ రెడ్డి'లాంటి సినిమాలో మళ్లీ నటిస్తారా అనే ప్రశ్నకు షాలినీ పాండే సమాధానం ఇదే!

Shalini Pandey Response on Reprising a Role Like Arjun Reddy
షార్ట్స్‌లో చూడండి
'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలిని పాండే హీరోయిన్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో బోల్డ్ సన్నివేశాల్లో షాలిని నటించింది. తాజాగా ఆమె డబ్బావాలా కార్టెల్ సిరీస్ లో నటించింది. ఇందులో ఒక బలమైన మహిళ పాత్రను ఆమె పోషించింది. 

ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. 'అర్జున్ రెడ్డి'లాంటి సినిమాలో మళ్లీ నటిస్తారా? అని ఆమెను యాంకర్ ప్రశ్నించారు. ఆ చిత్రం తన కెరీర్ బిగినింగ్ లో వచ్చిందని... అందులో తన పాత్ర కొంచెం బలహీనంగా ఉంటుందని తెలిపింది. 

మరోసారి అలాంటి మూవీలో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. అయితే, డైరెక్టర్ తో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకుంటానని తెలిపింది. బలమైన క్యారెక్టర్లు చేయాలనేది తన కోరిక అని... ఆ కోరిక డబ్బావాలా కార్టెల్ సిరీస్ తో తీరిపోయిందని చెప్పింది.
Go Back to Shorts
Shalini Pandey
Arjun Reddy
Dabbawala Cartel
Bollywood
Tollywood
Telugu Actress
Bold Scenes
Strong Female Character
Interview
Indian Cinema

More Telugu News