53 కిలోల బంగారం విడుదల కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ల కొట్టివేత
- బంగారం, బాండ్ల విడుదల కోరుతూ జనార్దన్ రెడ్డి, కుమారుడు, కూతురు పిటిషన్లు
- ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం
- సీబీఐ కోర్టులోనే పరిష్కరించుకోవాలన్న హైకోర్టు
2011 సెప్టెంబర్ 5వ తేదీన ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు సమయంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో 53 కిలోలున్న 105 బంగారు ఆభరణాలు, నగదు, బాండ్లను సీబీఐ సీజ్ చేసింది. వీటిని విడుదల చేయాలంటూ ఈ ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం వారి పిటిషన్లను కొట్టి వేసింది. సీబీఐ కోర్టులోనే పరిష్కరించుకోవాలని హైకోర్టు తెలిపింది.