కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ గైర్హాజరు... స్పందించిన తెలంగాణ అధికారి రాహుల్ బొజ్జా
- రేపు మరోమారు సమావేశం కావాలని నిర్ణయం
- ఏపీ అధికారులు ఉద్దేశపూర్వకంగా హాజరు కాలేదన్న రాహుల్ బొజ్జా
- తన వాదనలు రికార్డు చేసి కేంద్రానికి పంపించాలన్న రాహుల్ బొజ్జా
ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంపై రాహుల్ బొజ్జా స్పందించారు. సమావేశం ఏర్పాటు చేస్తే ఏపీ అధికారులు ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదని ఆరోపించారు. తన వాదనలను రికార్డు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు.
కాగా, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి మే వరకు తమకు 55 టీఎంసీల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరగా, తమకు 63 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.