తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
- మూడ్రోజులుగా బెదిరింపు కాల్స్
- తనిఖీలు నిర్వహించి బాంబు లేదని గుర్తించిన పోలీసులు
- నిందితుడిని అదుపులోకి పోలీసులు
బెదిరింపు ఫోన్ కాల్స్ ఎందుకు చేశాడనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడు మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని సయ్యద్ మీర్ మొహమూద్ అలీ (22)గా గుర్తించారు. ఎస్పీఎఫ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.