వైఎస్ జగన్కు హైకోర్టులో ఊరట .. పాస్పోర్టు పునరుద్దరణకు ఆదేశాలు
- వైఎస్ జగన్ యూకే పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు
- పాస్ పోర్టు కోసం ఎన్వోసీ జారీ చేసిన హైకోర్టు
- ఐదేళ్ల కాలపరిమితితో పాస్ పోర్టు ఇవ్వాలని అథారిటీకి ఆదేశం
పాస్పోర్టు పొందేందుకు ఎన్వోసీ జారీ చేయాలంటూ తొలుత వైఎస్ జగన్ విజయవాడ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టుకు హజరై 20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనని పేర్కొంది. దీంతో ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.