నేడు న్యూ ఇయర్ వేడుకలు వద్దు.. ఏపీ ప్రభుత్వం ఆదేశం
- మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతికి నివాళిగా వారం రోజుల సంతాప దినాలు
- ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించవద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
- నేడు సాధారణంగా విధులకు హాజరు కావాలని అధికారులకు సూచన
అయితే, కేక్ కటింగ్ లాంటి వేడుకలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఏదైనా సందేహం ఉంటే కేంద్ర ప్రభుత్వ సర్క్యులర్, లేదంటే బ్లూ బుక్ చూసి నివృత్తి చేసుకోవాలని కోరింది. కేంద్రం ప్రకటించిన సంతాప దినాలు పూర్తయ్యే వరకు అధికారికంగా ఎలాంటి వేడుకలు కానీ, మీట్ అండ్ గ్రీట్ కాని నిర్వహించవద్దని స్పష్టం చేసింది.