లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 226 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 63 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.47 శాతం లాభపడ్డ ఎం అండ్ ఎం షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ... మన మార్కెట్లు రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 78,699కి చేరుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 23,813 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.47%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.30%), బజాజ్ ఫైనాన్స్ (1.37%), టాటా మోటార్స్ (1.32%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.32%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.49%), టాటా స్టీల్ (-1.00%), అదానీ పోర్ట్స్ (-0.88%), జొమాటో (-0.75%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.72%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News