రాంచీలో రాహుల్ గాంధీతో భట్టి విక్రమార్క సమావేశం
- ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా భట్టివిక్రమార్క
- రాంచీలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క
- రాహుల్ గాంధీ రావడంతో శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించిన భట్టివిక్రమార్క
ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 81 అసెంబ్లీ స్థానాలకు గాను 70 చోట్ల జేఎంఎం, కాంగ్రెస్ పోటీ చేయనున్నాయి. మిగిలిన 11 స్థానాల్లో ఆర్జేడీ, వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. ఝార్ఖండ్లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశాల్లో పోలింగ్ జరగనుంది. అదే నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.