రావులపాలెంలో చిరుత సంచరిస్తోందన్న వదంతులు నమ్మొద్దు:డీఎఫ్ఓ
- రావులపాలెంలోని గౌతమి వంతెన వద్ద చిరుత కనిపించిందంటున్న మత్స్యకారులు
- డీఎఫ్ఓ ప్రసాదరావు నేతృత్వంలో పరిశీలన
- చిరుత సంచారంపై అనవాళ్లు లేవని తేల్చిన అటవీ శాఖ అధికారులు
డీఎఫ్ఓ ప్రసాదరావు నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలన చేశారు. గౌతమి వంతెన సమీపంలో చిరుత కదలికలపై ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. దీంతో ఆ ప్రాంతంలో చిరుత సంచారంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని డీఎఫ్ఓ ప్రసాదరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు బోటు సాయంతో గోదావరి మద్యలంకలో చిరుత ఆచూకీకై తాము పరిశీలన చేస్తామని ఆయన తెలిపారు.