పరుగులు పెడుతున్న పసిడి ధర.. రూ. 78 వేలు దాటేసి సరికొత్త రికార్డు
- ఆల్టైం హైను తాకిన పుత్తడి ధర
- కిలో వెండిపై రూ. 1000 పెరుగుదల
- దీపావళి నాటికి బంగారం ధర రూ. 80 వేలను తాకే అవకాశం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు ముందుకు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు దేశీయంగానూ కొనుగోళ్లు పెరగడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని చెబుతున్నారు. దసరా, దీపావళి వేళ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం వుందని, రూ. 80 వేల మార్కును కూడా తాకవచ్చని విశ్లేషిస్తున్నారు.