KTR: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు.. కేటీఆర్ ఆగ్ర‌హం

KTR Talk about Case on BRS MLA Padi Kaushik Reddy
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం ప‌ట్ల‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కేసు నమోదు చేశారని దుయ్య‌బట్టారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నేత‌లు భయపడేది లేద‌న్నారు. 

'ప్రజా సమస్యలను జడ్పీ సమావేశంలో క‌లెక్ట‌ర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కానీ, క‌లెక్ట‌ర్ స్పందించ‌క‌పోవ‌డంతో కౌశిక్ రెడ్డి నిర‌స‌న తెలిపే య‌త్నం చేశారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జాప్ర‌తినిధికి నిర‌స‌న తెలిపే హ‌క్కు లేదా?' అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. నిర‌స‌న తెల‌ప‌డం ఆయ‌న‌ చేసిన నేరమా? అని కేటీఆర్ నిల‌దీశారు. 

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాల‌పై ప్ర‌భుత్వం దృష్టిసారించ‌డంలేద‌ని కేటీఆర్ తెలిపారు. ప్ర‌తిప‌క్షాల నోరు మూయించాల‌నే కుట్ర‌తో ఇలా అక్ర‌మ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల ఒత్తిడితోనే ఎమ్మెల్యేపై కేసు పెట్టార‌ని ఆయ‌న‌ ఆరోపించారు. 

కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయటాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. దీన్ని దుర్మార్గ‌పూరిత చ‌ర్య‌గా పేర్కొన్నారు.  కౌశిక్ రెడ్డిపై కేసును వెంట‌నే ఉప‌సంహరించుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
Go Back to Shorts
KTR
BRS
Padi Kaushik Reddy
Telangana

More Telugu News