లోక్ సభలో ప్రతిపక్ష నేత ఎవరనేది కాంగ్రెస్ నిర్ణయిస్తుంది: శరద్ పవార్
- కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుందన్న శరద్ పవార్
- అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఒప్పందం కుదిరిందన్న పవార్
- కాంగ్రెస్ నిర్ణయం తర్వాత కూటమి ఆమోదం అవసరమని వ్యాఖ్య
లోక్ సభ డిప్యూటీ స్పీకర్గా ఎవరైనా ప్రతిపక్ష నేత ఉండేలా ప్రయత్నాలు చేస్తారా? అని ప్రశ్నించగా, శరద్ పవార్ స్పందిస్తూ... గతంలో రెండు పర్యాయాలు ప్రధాని మోదీ ఈ నియమాన్ని పాటించలేదన్నారు. ఈ అంశంపై చర్చ జరిగినా సానుకూల ఫలితం వస్తుందని అయితే తాము భావించడం లేదన్నారు. మహారాష్ట్రలో తమ కూటమి మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. ప్రధాని మోదీపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఆయన హామీలు నకిలీవి అని తేలాయన్నారు.