ఐర్లాండ్పై మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్
- నేడు భారత్, ఇర్లాండ్ మధ్య న్యూయార్క్ లో మ్యాచ్
- ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ
- టీ20 వరల్డ్ కప్2024లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్
‘‘ ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ప్రాక్టీస్ బాగానే చేశాం. ఈ వాతావరణంలో ఆడడానికి అలవాటు చేసుకోవాలి. కాస్త సవాలుగానే అనిపిస్తుంది. కానీ మేమంతా ప్రొఫెషనల్ క్రికెటర్లం. ఈ పిచ్పై ముందుగా ఒక లక్ష్యం ఉంటే బాగుంటుందని భావించాను. కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్తో పాటు మరొకరికి చోటు దక్కలేదు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
తుది జట్లు ఇవే..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, జాస్ లిటిల్, బెంజమిన్ వైట్.