ఇంటర్ పాసైనందుకు స్నేహితులకు పార్టీ.. బైక్పై వస్తుండగా బస్సు ఢీకొని నలుగురూ మృతి
- అక్కడికక్కడే ముగ్గురి మృతి
- ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరొకరి మృతి
- వర్ధన్నపేట, ఇల్లందలో విషాదఛాయలు
నిన్న వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో పాసైన గణేశ్.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం పార్టీ చేసుకుని తిరిగి ఒకే బైక్పై ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో వర్ధన్నపేట, ఇల్లందలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్, బస్సు రెండూ అతివేగంగా వెళ్తుండడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.