ఉప్పల్లో మ్యాచ్.. మెట్రోరైలు సమయం పొడిగింపు
- ఇవాళ్టి మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయన్న ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
- చివరి మెట్రో రైళ్లు రాత్రి 12.15 గంటలకు బయల్దేరి 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని ప్రకటన
- రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఎస్ఆర్హెచ్, ఎంఐ మ్యాచ్
చివరి మెట్రో రైళ్లు వాటి టెర్మినల్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయల్దేరి 1.10 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని ప్రకటించింది. నాగోల్, ఉప్పల్, స్టేడియం అండ్ ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. ఇక రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఎస్ఆర్హెచ్, ఎంఐ మ్యాచ్ కోసం ఇప్పటికే అంతా సిద్ధమైంది. మ్యాచుకు 3 గంటల ముందు నుంచే ప్రేక్షకులను స్టేడియం లోపలికి పంపించనున్నారు.