14 నెలల తర్వాత రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు.. బీసీసీఐ కీలక ప్రకటన
- పంత్ ఫిట్గా ఉన్నాడంటూ అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
- ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు కీలక ప్రకటన
- పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీ అందుబాటులో ఉండబోరని నిర్ధారణ
ఐపీఎల్ 2024కు షమీ, ప్రసిద్ధ్ కృష్ణ దూరం
టీమిండియా స్టార్ పేసర్లు మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్2024 ఎడిషన్కు అందుబాటులో ఉండబోరని బీసీసీఐ నిర్ధారించింది. ప్రసిద్ధ్ కృష్ణ ఎడమ కాలుకి శస్త్రచికిత్స చేయించుకున్నాడని, ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసాన్ని ఆరంభించనున్నాడని, రాబోయే టాటా ఐపీఎల్2024లో పాల్గొనబోడని వివరించింది. మరోవైపు స్టార్ పేసర్ మహ్మద్ షమీ కుడి కాలు మడమకు ఫిబ్రవరి 26, 2024న శస్త్రచికిత్స జరిగిందని, అతనిని కూడా ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, ఈ కారణంగా ఐపీఎల్2024కు అందుబాటులో ఉండడంలేదని వివరించింది. వీరిద్దరూ టీ20 వరల్డ్ కప్కు అందుబాటులో ఉండడంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.