మార్చి 2న వ్యూహం సినిమా విడుదల.. ఆర్జీవీ ట్వీట్
- సెన్సార్ సర్టిఫికెట్ చూపిస్తూ ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ
- పట్టువదలని విక్రమార్కుడిని అంటున్న ఆర్జీవీ
- ఎట్టకేలకు థియేటర్లకు రానున్న వ్యూహం సినిమా
వైఎస్సార్ మరణానంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను ఆర్జీవీ తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాపై టీడీపీ, జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ పొలిటికల్ మైలేజీ కోసం తమ నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఆర్జీవీపై మండిపడుతున్నాయి. ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు టీడీపీ నేతలు కోర్టుకెక్కారు. దీంతో గతేడాది డిసెంబర్ 29 న విడుదల కావాల్సిన సినిమా రెండు నెలల తర్వాత థియేటర్లలోకి రానుంది. కోర్టు ఆదేశాలతో విడుదలను పదే పదే వాయిదా వేసిన ఆర్జీవీ.. పట్టు వదలకుండా పోరాడి వ్యూహం విడుదలకు అనుమతి తెచ్చుకున్నానని చెప్పారు.