G. Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy writes letter to CM Revanth Reddy
  • భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి లేఖ
  • భారత్ మాల కింద నిర్మించే రోడ్ల కోసం భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్న కిషన్ రెడ్డి
  • ఆర్ఆర్ఆర్ కోసం ఎన్‌హెచ్ఏఐకి 50 శాతం నిధులు జమ చేయాలన్న కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు సంబంధించి ఈ లేఖను రాశారు. భారత్ మాల కింద నిర్మించే రోడ్ల కోసం భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం ఎన్‌హెచ్ఏఐకి 50 శాతం నిధులు జమ చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ స్పందించలేదని అందులో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చూడాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News