మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ సంక్రాంతి బరిలో నిలవనున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. మూవీలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్ను విడుదల చేసింది. విధ్వంసం నేను..వినాశనం నేను అంటూ సాగే రవితేజ్ ఇంట్రో అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది.