కేసీఆర్ గాయంపై ఆవేదనగా స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ
- నిన్న ఫాంహౌస్లోని బాత్రూంలో కాలుజారి పడిన కేసీఆర్
- యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ
గాయపడిన కేసీఆర్ను నిన్న యశోద ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు ఆయన తుంటి ఎముక రెండుచోట్ల విరిగినట్టు గుర్తించారు. 11 గంటలకు శస్త్రచికిత్స నిర్వహించనున్నట్టు తెలిపారు. విరిగిన తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని చెప్తున్నారు.