ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు
- మూడు వారాల పాటు పొడిగించినట్టు ట్రంప్ ప్రకటన
- ఇరుదేశాల అధినేతలతో త్వరలో వైట్హౌస్లో భేటీ
- దాడుల్లో జర్నలిస్టు సహా ఐదుగురు మృతి చెందిన మరుసటి రోజే నిర్ణయం
- ఇజ్రాయెల్తో ప్రత్యక్ష చర్చలను వ్యతిరేకిస్తున్న హిజ్బుల్లా
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతల నివారణకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో మూడు వారాల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ఈ సమయంలో ఇరు దేశాల అధినేతలు వైట్హౌస్లో సమావేశమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో వైట్హౌస్లో రెండో విడత చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ రాయబారి యెచిల్ లీటర్, లెబనాన్ రాయబారి నాడా మౌవాద్లతో ట్రంప్ చర్చించారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, హిజ్బుల్లా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో లెబనాన్కు అమెరికా సహాయం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్లకు త్వరలో ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 16న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యంత తీవ్రమైన దాడి జరిగిన మరుసటి రోజే ఈ పొడిగింపు నిర్ణయం రావడం గమనార్హం. ఒక రోజు క్రితం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో లెబనీస్ జర్నలిస్టు అమల్ ఖలీల్తో సహా ఐదుగురు మరణించారు.
మరోవైపు, ఇజ్రాయెల్ ఒప్పందానికి పూర్తిగా కట్టుబడి ఉంటేనే కాల్పుల విరమణకు మద్దతిస్తామని హిజ్బుల్లా ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్తో ప్రత్యక్ష చర్చలను తిరస్కరించింది. ఈ ప్రాంతంలో స్థిరత్వం కోసం హిజ్బుల్లాకు ఇరాన్ నిధులు ఆపాలని ట్రంప్ సూచించారు. మార్చి 2న హిజ్బుల్లా దాడుల తర్వాత మొదలైన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు లెబనాన్లో సుమారు 2,500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో వైట్హౌస్లో రెండో విడత చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ రాయబారి యెచిల్ లీటర్, లెబనాన్ రాయబారి నాడా మౌవాద్లతో ట్రంప్ చర్చించారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, హిజ్బుల్లా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో లెబనాన్కు అమెరికా సహాయం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్లకు త్వరలో ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 16న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యంత తీవ్రమైన దాడి జరిగిన మరుసటి రోజే ఈ పొడిగింపు నిర్ణయం రావడం గమనార్హం. ఒక రోజు క్రితం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో లెబనీస్ జర్నలిస్టు అమల్ ఖలీల్తో సహా ఐదుగురు మరణించారు.
మరోవైపు, ఇజ్రాయెల్ ఒప్పందానికి పూర్తిగా కట్టుబడి ఉంటేనే కాల్పుల విరమణకు మద్దతిస్తామని హిజ్బుల్లా ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్తో ప్రత్యక్ష చర్చలను తిరస్కరించింది. ఈ ప్రాంతంలో స్థిరత్వం కోసం హిజ్బుల్లాకు ఇరాన్ నిధులు ఆపాలని ట్రంప్ సూచించారు. మార్చి 2న హిజ్బుల్లా దాడుల తర్వాత మొదలైన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు లెబనాన్లో సుమారు 2,500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.