గాజాను రెండుగా వేరు చేసుకొని కీలక దాడులు: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
- ఉత్తర గాజా, దక్షిణ గాజాగా వేరు చేసుకొని దాడులు చేస్తున్నామని వెల్లడి
- అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మధ్యప్రాచ్య దేశాల్లో పర్యటన అనంతరం ప్రకటన
- బందీలను అప్పగించే వరకు దాడులు ఆపబోమని హెచ్చరించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు
ఇదిలావుండగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ను బ్లింకెన్ కలిశారు. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 9,770 మంది చనిపోయి ఉంటారని హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్యమంత్రిత్వశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా పౌరులే ఉన్నారని వివరించింది. నాలుగు వారాల నుంచి కొనసాగుతున్న యుద్ధంపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బందీలను తిరిగి అప్పగించే వరకు కాల్పుల విరమణ ఉండబోదని చెప్పడం మరింత కలవరానికి గురిచేస్తోంది.