అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం
- తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన యాగం
- మూడు రోజుల పాటు కొనసాగనున్న యాగం
- విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆధ్వర్యంలో యాగం
ఈరోజు రాజశ్యామల అమ్మవారు, చండీ అమ్మవార్లతో పాటు ఐదుగురిని ఆవాహనం చేసుకుని హోమం నిర్వహించనున్నారు. రెండో రోజు వేద పారాయణాలు ఉంటాయి. చివరి రోజున పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. మరోవైపు ఈ యాగాన్ని నిర్వహించిన ప్రతిసారి ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధిస్తూనే వస్తున్నారు. ఇదే సెంటిమెంటుతో ఇప్పుడు కూడా యాగాన్ని తలపెట్టారు. ఆయన ఫామ్ హౌస్ లో ఈ యాగం జరుగుతోంది.